English | Telugu
సీఎం జగన్ పై అసంతృప్తి.. ఎమ్మెల్యే వంశీ పాలిటిక్స్ కు గుడ్ బై..!
Updated : Oct 5, 2020
నియోజకవర్గంలోని వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు ఓ వైపు, దుట్టా రామచందర్ రావు మరో వైపు టీడీపీ నుండి వచ్చి చేరిన ఎమ్మెల్యే వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా వారు బహిరంగంగానే వంశీకి సవాళ్లు విసురుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయబోనని తాను ఇప్పటికే సీఎం జగన్ కు చెప్పినట్లు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. వంశీ తనను, తన అనుచరులను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆయన చెప్పారు. వైసీపీ కార్యకర్తలను వంశీ బెదిరిస్తున్నారని వెంకటరావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో ఎమ్మెల్యే వంశీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.