English | Telugu
టీటీడీ ఉద్యోగులపై భక్తుల రాళ్లదాడి
Updated : Jul 8, 2025
తిరుమల ఎంప్లాయిస్ గదుల కౌంటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గదులు కోసం గంటల గంటలు నిరీక్షించిన భక్తులు సమయమనం కోల్పోయి నేరుగా గదులు పొందుతున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేశారు. దీంతో తిరుపతికి చెందిన ఒక భక్తుడు విసిరిన రాళ్లతో ఇద్దరి ఉద్యోగులకు గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తి పరారైపోవడంతో వారి మిత్రులను అదుపులోకి తీసుకుని తిరుమల క్రైమ్ పోలీసులు విచారిస్తున్నరు. అయితే ఈ ఘటనతో మిగతా భక్తులకు ఆందోళనకు గురయ్యారు. ప్రశాంత వాతావరణం ఉన్న తిరుమలలో ఈ తరహా ఘటనలు ఏమిటని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.