English | Telugu
అధికారాన్ని వాడుకొని సీఎం జగన్ సొంత కంపెనీ కి ప్రయోజనాలు!!
Updated : Jun 10, 2020
సీఎం జగన్ సొంత కంపెనీ కి ప్రయోజనం సమకూర్చుకోవడానికి తన అధికారాన్ని వాడుకోవడం సిగ్గుచేటని టీడీపీ విమర్శిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. సీఎం జగన్ తన కంపెనీకి సున్నపురాయి గనులను 50 ఏళ్లకు పొడిగించుకున్నారని.. కృష్ణా నీళ్లు కేటాయించుకున్నారని.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా సొంత కంపెనీ కోసం అధికారాన్ని వాడుకోలేదని విమర్శించారు. తనకు ఒక్క చాన్సు ఇవ్వాలని ప్రజలను కోరింది అన్నీ సొంతానికి చేసుకోవడానికేనా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.