English | Telugu
కరోనా పేరుతో తిరుపతి ఎన్నిక ఆపుతారా! వైసీపీని నిలదీసిన బోండా
Updated : Nov 19, 2020
కరోనా పేరుతో ఎన్నికలు వద్దంటున్న వైసీపీ ప్రభుత్వం.. ఏపీలో బడులు ఎందుకు తెరిచిందని బోండా ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యం అంటే వైసీపీకి లెక్క లేదా? అని ఆయన నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతున్నట్లే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను కూడా కరోనా పేరుతో వైసీపీ నిలిపివేయగలదా అని బోండా ఉమ ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ను తిడుతోన్న ప్రభుత్వం దేశంలో ఒక్క వైసీపీయేనని ఆయన విమర్శలు గుప్పించారు. జడ్జిలపై కూడా వైసీపీ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిందని చెప్పారు.