English | Telugu
గ్రేటర్ టికెట్ల కోసం పోటీ! టీటీడీపీలో జోష్
Updated : Nov 19, 2020
అభ్యర్థులు బలంగా ఉన్న ప్రతీ డివిజన్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది టీటీడీపీ. అయితే వారికి ఊహించని రీతిలో స్పందన వస్తోందట. ఒక్కో డివిజన్కు రెండు నుంచి ఐదు వరకు దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. టీటీడీపీ సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్రావు, పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, జీహెచ్ఎంసీ టీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ అరవింద్కుమార్ గౌడ్ అశావాహులను వడపోస్తున్నారని తెలుస్తోంది. 80 మంది బలమైన అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేశారని సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేసి సత్తా చాటాలని కంభంపాటి టీటీడీపీ నేతలను సూచించారు. అభ్యర్థుల ఎంపిక కోసం తాను అన్ని డివిజన్లలో పర్యటించానని, మంచి స్పందన వచ్చిందని అరవింద్కుమార్ గౌడ్ తెలిపారు.