English | Telugu

తమిళనాడు ట్రెండ్ సెట్ చేస్తే, చికెన్ అలాగే ఖాళీ అయిపోతుంది మరి!

పండగ తొలినాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నం కరువు, పండగ మన్నాడు మజ్జిగ కరువు... అయితే, ఇపుడు ఆ కరువు మాట పక్కన బెట్టి చికెన్ కోసం ఆ హోటల్ మీదకు ఉరికెత్తుకొచ్చారు ఊరి జనం. అది గుంటూరు లో జరిగిన లేటెస్ట్ వింత. ఏ వింతలకైనా తమిళనాడు ట్రెండ్ సెట్ చేస్తే, మిగిలిన జనాలు అది ఫాలో చేస్తారు గా.. ఓ సారి అక్కడ ఏమి జరిగిందో మీరే చదవండి. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి ప్రజలు మాత్రం కరోనా భయాన్ని పక్కనపెట్టేసి అందినంత చికెన్ బిర్యానీ లాగించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. గురువారం ఇక్కడ కొత్తగా ఓ హోటల్ ప్రారంభమైంది. ప్రజలను ఆకర్షించేందుకు ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నట్టు బోర్డులు పెట్టారు. అంతే.. జనాలు విరగబడిపోయారు. బిర్యానీని దక్కించుకునేందుకు బారులుతీరారు. వారిని అదుపు చేసేందుకు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కాగా, రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ హాంఫట్ అయిపోయింది. కరోనా భయంతో బిర్యానీ అమ్ముడుపోతుందో, లేదోనని తొలుత భయపడ్డామని, అయితే, వినియోగదారుల నుంచి విశేష స్పందన రావడం తమకు సంతోషాన్నిచ్చిందని హోటల్ యజమాని పేర్కొన్నారు.