English | Telugu
సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కి చుక్కెదురు.. హైకోర్టుకు కీలక ఆదేశాలు
Updated : Oct 1, 2020
సుధీర్ బాబు తహసీల్దార్ హోదాలో అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా, హైకోర్టు ఆ ఆదేశాలపై స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం స్టే ఎత్తేయడానికి నిరాకరిస్తూ హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.