English | Telugu
జగన్ సర్కార్ పిటిషన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Updated : Nov 16, 2020
ఈసీ తరపు న్యాయవాది పరమేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికలు రద్దు చేయలేదని, వాయిదా మాత్రమే వేశారని తెలిపారు. దీంతో నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఎస్ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. దరఖాస్తు పై తీసుకున్న నిర్ణయానికి తగిన కారణాలు ఎస్ఈసీ తన ఆర్డర్ లో తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుమతి ఇవ్వకపోతే తిరిగి సుప్రీం కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిందింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.