English | Telugu

దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ టీఆర్ఎస్ నాయకుడు..

దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ డిసైడ్ చేసింది. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ ‌ను వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.

శ్రీనివాస్‌రెడ్డి మంగళవారమే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దుబ్బాక లో టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా సోలిపేట సుజాతను ఎన్నికల బరిలోకి దింపుతుండగా, బీజేపీ రఘునందనరావు పేరును ప్రకటించింది. అయితే, టీఆర్ఎస్ నుండి దుబ్బాక టికెట్‌ను ఆశించి భంగపడిన శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీ వదిలి కాంగ్రెస్‌లో చేరగా, వెంటనే ఆయనకు కాంగ్ర్రెస్ టికెట్ ఖరారు కావడం విశేషం. దీంట్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.