English | Telugu
పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి : కేంద్రానికి చంద్రబాబు లేఖ
Updated : Apr 25, 2020
జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి పొగాకు ఉత్పత్తి చేశారు. కానీ కరోనా సమస్యతో కొనుగోళ్లు నిలిచిపోవటంతో ఆ రైతులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. అలాగే ఇతర పంటలు సాగుచేసిన రైతు కూడా తమ కష్టార్జితాన్ని కొనుగోలు చేసే నాథుడు లేక లబోదిబోమంటున్నారు.