English | Telugu
సోనియా స్థానంలో యూపీఏ చైర్మెన్ గా శరద్ పవార్!
Updated : Dec 11, 2020
ప్రస్తుతం యూపీఏ కూటమి దాదాపు పతనావస్థలో ఉంది. సొంత పార్టీనే నిలబెట్టలేని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపధ్యంలో యూపీఏకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి శరద్ పవార్ కు బాధ్యతలు అప్పగించాలని మిగితా విపక్ష పార్టీలన్ని భావిస్తున్నాయట. యూపీఏ చైర్మన్గా శరద్ పవార్ నియమితులైతే మహదానందమని శివసేన ప్రకటించింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిందని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. యూపీఏ చైర్మన్గా శరద్ పవార్ బాధ్యతలు స్వీకరిస్తే శివసేన మద్దతు ఇస్తుందని కూడా సంజయ్ రౌత్ ప్రకటించారు.
మరోవైపు ఎన్సీపీ మాత్రం అలాంటి ప్రస్తావన ఏమి లేదని చెబుతోంది. యూపీఏలో ఉన్న మిత్ర పార్టీలతో ఇలాంటి చర్చలు ఏవీ జరగలేదని, ఇలాంటి ప్రతిపాదనలు తమ వరకు రాలేదని ఎన్సీపీ నేత మహేష్ తపసీ అన్నారు. యూపీఏ చైర్పర్సన్గా శరద్ పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు రైతులు చేస్తున్న ఆందోళన నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకు కొన్ని మీడియా సంస్థలు పుకార్లు పుట్టిస్తున్నాయని మహేష్ చెప్పారు.