English | Telugu

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సి. పార్థసారథి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సి. పార్థసారథిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ఆయన ఏప్రిల్ లో ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా పదవీవిరమణ చేశారు. విజయనగరం ఆర్డివోగా ఉద్యోగప్రస్థానం ప్రారంభించిన సి. పార్థసారథి ఐఎఎస్ అధికారిగా అనేక శాఖల్లో పనిచేశారు. ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసే సమయంలో ప్రజల్లో ఎయిడ్స్ పై అవగాహన కల్పించడానికి విశేషకృషి చేశారు. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చదివిన ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. వ్యవసాయశాఖ కమిషనర్ గా తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా పార్థసారథి ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు.