English | Telugu
అమరావతి కేసులో కొత్త ట్విస్ట్.. సుప్రీంలో విచారణ 19 కి వాయిదా..
Updated : Aug 17, 2020
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ఈరోజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఆ సమయంలో ఈ కేసులో వాదిస్తున్న రంజిత్ కుమార్ అనే న్యాయవాది సుప్రీం చీఫ్ జస్టిస్ ముందు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమరావతి రాజధాని రైతులు దాఖలు చేసిన పిటీషన్ పైన ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ఇదే విషయమై హైకోర్టు ఇచ్చిన స్టిటిస్ కో ఉత్తర్వుల పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకు వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసారు. అయితే రాజధాని రైతుల తరపున సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బంధువులే న్యాయస్థానాల్లో వాదిస్తున్న విషయాన్నిఅయన ప్రస్తావించారు. దీంతో ఈ కేసు విచారణ నుండి తాను తప్పుకుంటున్నానని తెలుపుతూ "నాట్ బిఫోర్ మీ" అంటూ ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసారు.