English | Telugu

మ‌రో వివాదంలో మన్సాస్ చైర్ ప‌ర్స‌న్‌ సంచ‌యిత

మన్సాస్ చైర్ ప‌ర్స‌న్ సంచ‌యిత గ‌ణ‌ప‌తి రాజు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానానికి తాళాలు వేయ‌డం వివాదానికి దారి తీసింది. విద్యార్థులు, సిబ్బంది త‌ప్ప మిగిలిన వారు లోప‌లికి వెళ్ల‌కూడ‌దంటూ మ‌హ‌రాజా కాలేజీ ప్రిన్సిపాల్ నోటీసులు జారీ చేశారు. ఈ నిర్ణ‌యంపై స్థానికులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఎన్నో ఏళ్లుగా క‌ళాశాల మైదానంలో న‌గ‌ర ప్ర‌జ‌లు వాకింగ్ చేస్తుండ‌గా, కొత్తగా ఇప్పుడు మైదానానికి తాళాలు వేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మన్సాస్ యాజ‌మాన్యం తీరుపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.