English | Telugu
ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా ఫైనల్ గా ఆ టెస్ట్ చేయాల్సిందే... కేంద్రం ఆదేశం
Updated : Sep 10, 2020
అంతేకాకుండా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేసిన అసింప్టమాటిక్ కేసుల్లో రెండు, మూడు రోజుల గడిచిన తరువాత కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి కూడా ఆర్టీ-పిసిఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలి. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది కదా అని వారిని వదిలేస్తే కరోనా లక్షణాలు ఉన్నవారి ద్వారా మిగిలిన వారికి కూడా వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఈ తాజా ఆదేశాలను పాటించడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, అంతేకాకుండా ఈ వైరస్ మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కరోనా టెస్టుల్లో ఆర్టీ-పిసిఆర్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.