English | Telugu

సీఎం కేసీఆర్ చెప్పినా దాడులు ఆగలేదు.. టీఆర్ఎస్ కి నష్టం త‌ప్ప‌దు

ప్ర‌భుత్వ విప్, పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆదివాసీల స‌మ‌స్య‌లు ప‌రిష్కాస్తామని చెప్పినందుకే తాను కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరాన‌ని అన్నారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల‌ను బతకనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలపై అధికారులు దాడులు చేయ‌వ‌ద్ద‌ని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసినా దాడులు ఆగడం లేదని అన్నారు. పోడు ఉద్య‌మంలో తాము వెనుక‌డుగు వేసే ప్ర‌శ్నే లేద‌న్నారు. అట‌వీ భూములపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని, ఆదేశాలివ్వాల‌ని కోరారు. లేదంటే ఆదివాసీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి నష్టం త‌ప్ప‌ద‌ని రేగా కాంతారావు హెచ్చ‌రించారు.