English | Telugu

అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జగన్! జనసేన ఎమ్మెల్యే ప్రశంసలు 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన స్వర్ణయుగంలా ఉండేదని.. ఇప్పుడు వైఎస్ దారిలోనే జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో మాట్లాడిన రాపాక.. వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పేదల అవసరాలకు అనుగుణంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. పేదల ఇంటి కల సాకారం చేసింది అప్పట్లో వైఎస్ఆర్.. ఇప్పుడు వైఎస్ జగనేనన్నారు. జగన్ లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టమన్నారు వర ప్రసాద్. సీఎం లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని కొనియాడారు జనసేన ఎమ్మెల్యే.