English | Telugu
విలేఖరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు
Updated : Nov 10, 2020
హైకోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో రఘునందన్ రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. సిద్దిపేటలో బీఎస్సీ చేసిన రఘనందన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా చేరారు.
రెండుసార్లు ఓటమి
తెరాస ప్రారంభం నుంచి రఘునందన్ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెండైన రఘు.. భాజపాలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో విజయం సాధించారు.