English | Telugu

టీఆర్ఎస్ ఎంపీ సొంతూరులో బీజేపీ లీడ్! ఉత్తమ్ ఊరులో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్! 

దుబ్బాక ఉప ఎన్నికలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ప్రముఖులకు తమ సొంత గ్రామాల్లో చుక్కెదురైంది. ఇక ప్రచారంలో పాల్గొన్న పార్టీల ముఖ్య నేతలకు చేదు ఫలితాలు వచ్చాయి. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామమైన దుబ్బాక మండలంలోని పోతారంలో 110 ఓట్లు రఘునందన్ రావుకు ఎక్కువగా పోలయ్యాయి. రఘునందన్ రావు సొంతూరు బొప్పాపూర్‌లో ఆయన 277 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇక్కడ బీజేపీకి 424, టీఆర్ఎస్‌కు 147 ఓట్లు లభించాయి. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్‌లో టీఆర్ఎస్‌కు 846 ఓట్లు పోలయ్యాయి.

ఇక మంత్రి హరీష్ రావు దత్తత గ్రామం అయిన మిరుదొడ్డి మండలంలోని చీకుడు గ్రామంలో బీజేపీకి 22 ఓట్ల లీడ్ వచ్చింది. చీకుడులో టీఆర్ ఎస్ కు 744 ఓట్లు రాగా, బీజేపీకి 766 ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ దుబ్బాకలో ఘోరంగా చతికిలపడింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరించిన లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ గ్రామంలో కాంగ్రెస్‎కు కేవలం 163 ఓట్లు మాత్రమే వచ్చాయి. లచ్చపేటలో టీఆర్ఎస్ పార్టీకి 520 ఓట్లు బీజేపీకి 490 ఓట్లు పోలయ్యాయి.