English | Telugu
శిరోముండనం బాధితుడి లేఖ పై సీరియస్ గా రియాక్టయిన రాష్ట్రపతి
Updated : Aug 12, 2020
కొద్దీ రోజుల క్రితం తనకు శిరోముండనం చేసిన ఘటనలో ముఖ్య కారణమైన వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ప్రసాద్ నేరుగా రాష్ట్రపతికి లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని దాంతో రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నానని.. మావోయిస్టుల్లో చేరి తన పరువు కాపాడుకుంటానని దానికి అనుమతివ్వాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఐతే బాధితుడి లేఖ అందుకున్న 24 గంటల్లోనే రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం గమనార్హం.