English | Telugu

ఇఎస్ఐ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో అచ్చం నాయుడు అరెస్ట్

టీడీపీ అధికారం లో ఉన్నపుడు జరిగినట్లుగా చెప్పబడుతున్న ఇఎస్ఐ స్కామ్ పై జగన్ ప్రభుత్వం ఎసిబి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. గతం లో కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్ల వ్యవహారం లో అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం భావించింది. ఈ స్కామ్ జరిగిన సమయం లో అచ్చం నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయం లో గత అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో ఉన్న టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చం నాయుడు ను ఎసిబి అదుపులోకి తీసుకుని విజయవాడ కు తరలిస్తున్నట్లుగా సమాచారం. దీని కోసం దాదాపుగా 100 మంది పొలిసు బలగం తో అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో శాసనసభ సమావేశాలు జరగనున్న నేపధ్యం లో ఈ అరెస్ట్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.