English | Telugu

తెలంగాణ లో ఒక్క రోజే డబుల్ సెంచరి దాటిన కరోనా కేసులు 

కరోనా కట్టడికి మాస్కులు ధరించండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయండి అంటూ ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుని చెపుతున్నాయి. అయినా ప్రజలు మాస్కులు లేకుండా యధేచ్చగా తిరిగేస్తున్నారు. తాజాగా తెలంగాణ లో నిన్న కొత్తగా 209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా 9 మంది మృతి చెందారు. నిన్న నమోదైన కేసులలో 175 ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రం మొత్తంలో 4,320 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 1993 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,162 పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.