English | Telugu
బీజేపీ కమలం గుర్తును వెనక్కు తీసుకోవాలని దాఖలైన పిల్
Updated : Dec 10, 2020
దీంతో ఈ విషయం పై ఆయన తాజాగా అలహాబాద్ హైకోర్టు లో పిల్ దాఖలు చేసారు. అంతేగాకుండా వివిధ రాజకీయ పార్టీలకు కేటాయించే గుర్తులను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకునేలా పరిమితం చేయాలని, వాటిని తమ పార్టీ లోగోలుగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వవద్దని అయన తన పిల్ లో కోరారు. పార్టీలు తమ గుర్తులను నిత్యం వాడుకునేందుకు అనుమతి ఇస్తే, ఏ పార్టీతోనూ సంబంధంలేని ఇండిపెండెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని అయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని ఈసీని ఆదేశించాలని అయన తన పిల్ లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
దీని పై స్పందించిన చీఫ్ జస్టిస్ గోవింద్ మాధుర్, జస్టిస్ పీయూష్ అగర్వాల్తో కూడిన ధర్మాసనం.. పిల్ లో పేర్కొన్న అంశాలపై తన స్పందనను తెలియజేయాల్సిందిగా ఈసీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం పై తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అలాగే, ఈ పిల్ లో ఇతర రాజకీయ పార్టీలను కూడా ప్రతివాదులుగా చేర్చాలంటూ కాళీ శంకర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అయితే ఈ పిల్పై తమ స్పందనను తెలియజేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.