English | Telugu
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన!
Updated : Jun 5, 2020
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా మాత్రమే నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ రెండు పథకాలపైనే డబ్బులు వెచ్చించడానికి తాము అనుమతినిస్తున్నామని, ఇతర పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతించమని ఆర్థిక శాఖ ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని, అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మల తెలిపారు. ఒకవేళ నిబంధలనకు విరుద్ధంగా నిధులను కేటాయించాల్సి వస్తే, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.