English | Telugu
సహనం కోల్పోయిన మిస్టర్ కూల్ సీఎం నితీష్.. తేజస్వి యాదవ్ పై ఫైర్
Updated : Nov 28, 2020
ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో సీఎం నితీశ్ కుమార్పై నమోదైన క్రిమినల్ కేసుల గురించి తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని పదేపదే నిలదీశారు. దీంతో నితీష్ ఒక్కసారిగా తేజస్వియాదవ్పై సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహంతో విరుచుకు పడ్డారు .
‘‘ప్రతిపక్ష నాయకుడు నాకు సోదరుడి లాంటి స్నేహితుడి కుమారుడు కావడం వల్లే ఇప్పటి వరకు ఆయన చెప్పినదంతా ఓపికతో విన్నాను. తేజస్వి చెప్పినదంతా శుద్ధ అబద్ధం. నేను ఇంతకుమించి ఇంకేమీ మాట్లాడను. ఆయన తండ్రిని లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ను చేసిందెవరో తేజస్వికి తెలుసా? కనీసం ఆయనను డిప్యూటీ సీఎంను చేసిందెవరో తెలుసా? నాపై ఆరోపణలు చేస్తున్న ఆయన మొదట ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. సమాధానం చెప్పలేరు కాబట్టి ఆయన సభ నుంచి బయటకు వెళ్లడమే మంచిది’’ అని తేజస్విపై విరుచుకుపడ్డారు. తనపై నమోదైన క్రిమినల్ కేసుల గురించి తేజస్వి యాదవ్ పదే పదే లేవనెత్తడంతో ఊగిపోయిన నితిశ్ కుమార్.. తేజస్వికి ఈ విధంగా బదులిచ్చారు.