English | Telugu
మీటర్లు బిగిస్తే పీకేస్తాం- జగన్ పై లోకేష్ ఫైర్
Updated : Oct 30, 2020
వైసీపీ సర్కార్ చేతగానితనం వల్లే పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం యూటర్న్ తీసుకుందని లోకేష్ ఆరోపించారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టమని వాపోయారు. పోలవరం 70శాతం పూర్తయితే మీసం తీయించుకుంటానన్న ఆ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారన్న నారా లోకేష్.. జగన్ ప్యాలెస్లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలని సూచించారు. ఆక్వా రంగం కుదేలైనందున ఎకరాకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలని, ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.5వేలు పరిహారం ఇవ్వాలన్నారు.