English | Telugu

యుద్ధం డైరెక్ట్ గా చేసే దమ్ములేని దద్దమ్మ జగన్!!

ఇటీవల సోషల్ మీడియాలో జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టారంటూ పశ్చిమ గోదావరి జిల్లాకి అనూష ఉండవల్లి అనే మహిళకి సీఐడీ నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెకి టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పించారంటూ నారా లోకేష్ పేరుతో లెటర్ హెడ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చాలామంది నిజం అనుకుంటున్నారు. అయితే ఇది ఫేక్ అని తెలిసింది. తాజాగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన నారా లోకేష్.. వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

"ఫేక్ బతుకులు మారవు. వైఎస్ జగన్ వేసే 5 రూపాయిల చిల్లర కోసం సొంత తల్లి పై తప్పుడు పోస్ట్ పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయింది వైకాపా పేటిఎం బ్యాచ్. యుద్ధం డైరెక్ట్ గా చేసే దమ్ములేని దద్దమ్మ జగన్ ఇలాంటి చెత్త పనులు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్ గారు నన్ను బదనాం చెయ్యడానికి పడుతున్న కష్టంలో ఒక్క శాతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టినా, ప్రజలు హర్షిస్తారు. లేదు, నన్ను టార్గెట్ చెయ్యడమే మీ లక్ష్యం అయితే ఆల్ ది బెస్ట్." అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.