English | Telugu
సీఎం జగన్ సొంత ఊరిలోని మహిళకే రక్షణ లేదు.. లోకేష్ ఫైర్
Updated : Dec 9, 2020
"రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ఓ దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది. అయితే ఈ విషయం బయటకి రాకుండా చెయ్యడానికి జగన్ ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ.. మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి. అంతేకాకుండా ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి" అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.