English | Telugu
భారత్ లో కరోనా విజృంభణ.. వుహాన్ ను దాటేసిన ముంబై!
Updated : Jun 10, 2020
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే మొత్తం కేసుల విషయంలో మహారాష్ట్ర, చైనాను అధిగమించగా.. తాజాగా ముంబై నగరం, కేసుల విషయంలో వూహాన్ ను దాటేసింది. కరోనాకి పుట్టినిల్లు చైనాలోని వుహాన్. అలాంటిది మహారాష్ట్ర, చైనాను దాటేస్తే.. మహారాష్ట్రలోని ముంబై నగరం, వూహాన్ ను దాటేసింది. ఇప్పటివరకు ముంబైలో 51,100 పైగా కేసులు నమోదయ్యాయి. ఇక వుహాన్ లో 50,333 కేసులు నమోదు కాగా, 3,869 మంది మరణించారు. ముంబైలో మరణాల సంఖ్య 1,760గా ఉంది. మరణాల విషయంలో మాత్రం వుహాన్ తో పోలిస్తే ముంబైలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.