English | Telugu

ఏపీలో పాలెగాళ్ళ పాలన.. జగన్ సర్కార్ పై రఘురామరాజు ఫైర్

వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "జగన్‌ నీరో చక్రవర్తిలా మారారు. రోడ్లు లేకపోయినా గన్నవరం వెళ్లేందుకు అయనకు హెలికాఫ్టర్‌ ఉంది. మరి ప్రజల సౌకర్యము కోసం ఇంటింటికీ హెలికాఫ్టర్స్‌ పథకం పెడతారా? ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్రపతికి లేఖ రాశా. అసలు జగన్‌ మనసు తెలియకనే వైసీపీలో చేరా. ప్రస్తుతం ఏపీలో పాలెగాళ్ల పరిపాలన నడుస్తోంది. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఒక పాలెగాడు. మా నియోజకవర్గం నరసాపురంలో ఓ పాలెగాడు ఆవ భూముల్లో అవినీతి చేశారు. అలాగే అమరావతి రైతులపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరం. పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. సీఎం బాబాయ్ ఆవ భూముల్లో అవినీతి చేశారని ప్రజలు అనుకుంటున్నారు. పార్లమెంట్‌లో మీ సామాజికవర్గం వారికి పదవులు ఇచ్చారు. అంతేకాకుండా జగతి పబ్లికేషన్స్‌లో ఎంపీ బాలశౌరి పెట్టుబడులపై సీబీఐకి ఫిర్యాదు చేశా. త్వరలో విచారణ కూడా జరుగుతుంది" అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.