English | Telugu
కేసీఆర్ కన్పించకపోతే వచ్చే నష్టమేంటి? పాలన ఆగిందా? పథకాలు ఆగాయా?
Updated : Jul 9, 2020
తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ తలసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి? సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా? ప్రభుత్వ పథకాలు ఆగాయా? అని తలసాని ప్రశ్నించారు.
ఇక, సచివాలయం కూల్చివేత, కరోనా కట్టడిలో విఫలమంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా తలసాని విరుచుకుపడ్డారు. పరిపాలనలో సచివాలయం ఒక భాగం. కొత్త సచివాలయం కడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నాడు అంటూ కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. బీజేపీ నాయకులకు చేతనైతే.. ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలి అన్నారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం ఎందుకని మేము ప్రశ్నించామా? అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో బీజేపీ నేతలు చెప్పాలి అని తలసాని ప్రశ్నించారు.