English | Telugu

నిబంధనలు కఠినతరం చేయండి! మంత్రి శ్రీనివాస్ గౌడ్

కరోనా నివారణ చర్యలు కఠినతరంగ ఉండేలా అమలు చేయాలని మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరం నందు వ్యాపారస్తుల తో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు వ్యాపారస్తులకు నిర్ణిత దూరంగా ఉండేలా మార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందన్నారు. వివిధ షాపులను పరిశీలించగా వారు నిబంధనలు పాటించడం లేదన్నారు. ముందు ఒకటి కీ రెండు మార్లు వారికీ చెప్పి నిబంధనలు పాటించని షాప్ లను 6మాసాలు సీజ్ చేయాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్ మరొక్కరికి వచ్చిందని పేర్కొన్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన వారికీ కరోనా పాజిటివ్ రావడం జరుగుతుందన్నారు. పట్టణ కేంద్రంలోని మంచినూనె కంపెనీ లు మరింత గా తయారు చేయాలని చెప్పారు. పని చేసే వారికీ అధనంగా వేతనం ఇవ్వాలని కంపెనీల యాజమాన్యం ను ఆదేశించారు. అధికారులు మరింత కఠినంగా వ్యహరించి కరోనా ను మన నుంచి దూరం చెందామని పిలుపునిచ్చారు.

అనుమానం వచ్చిన వారికీ ముద్ర వేసి క్వారంటైన్ లో ఉంచడం జరిగిందని వారికే కరోనా పాజిటివ్ వస్తున్నాయన్నారు. పక్క ప్రణాళికలతో ముందుకు సాగుతున్నందుకు కరోనా ను నిలుపుదల చేస్తున్నామని చెప్పారు. ప్రజలు మరింతగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

వ్యాపారస్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిస్కారిస్తామని వ్యాపారస్తులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సీతారామారావు, dso వనజాత, వ్యాపారస్తులు ఉన్నారు.