English | Telugu

కరోనా కాలంలోనూ బ్యాంకుల విలీనం.. చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంకు

భారత్ లో మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం జరిగింది. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటి(ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి రానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు నాలుగూ.. చిన్న బ్యాంకులను తమలోకి విలీనం చేసుకున్నాయి. కరోనా కారణంగా బ్యాంకుల విలీనం నిలిచిపోయే అవకాశముందని అందరూ భావించినా.. ముందుగా ప్రకటించినట్టుగానే విలీనం జరిగిపోయింది.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లోకి విలీనం అయ్యాయి. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్బీ అవతరించింది.

అలాగే, సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులోనూ, అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులోనూ విలీనం అయ్యాయి. ఇక ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. ఈ విలీనంతో, తెలుగు రాష్ట్రాల్లో పురాతన బ్యాంకుగా పేరుగాంచిన ఆంధ్రా బ్యాంకు చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది.