English | Telugu
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మేయర్ బొంతు రామ్మోహన్ భార్యకు చేదు అనుభవం
Updated : Nov 25, 2020
ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు ఆమె కుషాయిగూడలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అయితే, వరద సాయంపై స్థానిక మహిళలు ఆమెను అక్కడే నిలదీశారు. దీంతో అందరికీ వరద సాయం అందేలా చూస్తామని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.