English | Telugu

సంచయిత మరో వివాదాస్పద నిర్ణయం.. మాన్సాస్ కార్యాలయం తరలింపు!

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఆమె.. తాజాగా మరో వివాదానికి తెరతీశారు. ఇప్పటివరకూ విజయనగరం మహారాజ కోటలో ఉన్న మాన్సాస్ రెవిన్యూ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయం తరలింపు నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. ఛైర్ పర్సన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ల సంతకాలతో కార్యాలయం మార్పు నిర్ణయం మోమో విడుదలైంది. 1958 లో పివిజి రాజు స్థాపించిన మాన్సాస్ కార్యాలయం అప్పటి నుండి కోటలోనే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కార్యాలయాన్ని తరలించాలని మాన్సాస్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సంచయిత నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.