English | Telugu
ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య. చావు కూడా విడదీయలేని ప్రేమ!
Updated : Oct 25, 2020
మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామానికి ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. మొదట స్నేహంతో ఏర్పడిన వారి పరిచయం గాఢ ప్రేమకు దారితీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోయారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనకున్నారు. ఇంతలోనే ప్రియురాలు అనారోగ్యంతో కన్నుమూసింది.
ప్రియురాలు చనిపోవడంతో ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు ప్రియుడు. మానసికంగా కుమిలిపోయాడు. తన ప్రాణంలాంటి ప్రియురాలే లేని ఈ లోకంలో ఇక తాను భూమి మీద బతకడం ఎందుకని భావించిన ప్రియుడు.. చివరకు ప్రియురాలి సమాధి వద్దకు వెళ్లి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దసరా పండుగ రోజే ప్రియుడు ఉరి వేసుకుని చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇద్దరు ప్రేమికుల మరణంతో ఆ రెండు కుటుంబాలతో పాటు బంధువులు, సన్నిహితులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.