English | Telugu

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత 

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) ఈ ఉదయం కన్నుమూశారు. ఈ మరణాన్ని టాండన్ కుమారుడు, యూపీ మంత్రి అశుతోష్ టాండన్ ధ్రువీకరించారు. ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో గత నెల 11న లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆయన మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయకపోవడంతో ఆయన శరీరం వైద్యానికి సహకరించలేదని డాక్టర్లు తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అనుచరుడిగా భారతీయ జనతా పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలలో అయన కీలక పాత్ర పోషించారు. మాయావతి ఆధ్వర్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం లోను, కల్యాణ్ సింగ్ మంత్రివర్గాలలో ఆయన మంత్రిగా పనిచేశారు.