English | Telugu
నెలాఖరు దాకా ప్రయివేట్ రైలు సర్వీసుల నిలిపివేత
Updated : Apr 7, 2020
ఐఆర్సీటీసీ ప్రస్తుతం రెండు తేజాస్ రైళ్లను, కాశీ ఎక్స్ప్రెస్ను నడుపుతోంది. కాశీ మహాకాళ్ ఎక్స్ప్రెస్ వారణాసి-ఇండోర్ రూట్లో రాకపోకలు సాగిస్తుండగా, తేజాస్ రైళ్లు లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై రూట్లలో నడుస్తున్నాయి. ఈ రూట్లలో ప్రైవేట్ రైళ్లను ఏప్రిల్ 15-30 వరకూ ఐఆర్సీటీసీ నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 28 ప్రాంతాల్లోని తమ కిచెన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేపట్టామని ఐఆర్సీటీసీ తెలిపింది.