English | Telugu
వరద సాయం కోసం ఆందోళనలు! గ్రేటర్ లో పోలీసులకు తిప్పలు
Updated : Dec 7, 2020
వరద సహాయం కోసం కొందరు బాధితులు సీఎం క్యాంప్ ఆఫీస్కు సమీపంలోని మీ సేవ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. లాక్డౌన్లో ఏ విధంగా అయితే పరిహారం ఇచ్చారో అదే విధంగా 10 వేలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. సెకెండ్ ఫ్లోర్ ఉన్న వారికి వరద సహాయం చేశారు కానీ నిజమైన బాధితులకు అన్యాయం చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ స్టేట్మెంట్కు వ్యతిరేకంగా క్యాంపు ఆఫీస్ వద్ద నినాదాలు చేశారు.
ఎన్నికలకు ముందు వరద బాధితులకు కుటుంబానికి పది వేల ఆర్థిక సాయం చేసింది ప్రభుత్వం. గ్రేటర్ ఎన్నికల కోడ్ తో అది ఆగిపోయింది. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే.. డిసెంబర్ 7 నుంచి సాయం అందని వరద బాధితులకు 10 వేల రూపాయలు ఇస్తామని గ్రేటర్ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో సోమవారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి మీసేవ సెంటర్లకు వచ్చారు వరద బాధితులు.