English | Telugu
కోట్ల విలువైన భూమిని.. ఏ ప్రాతిపదికన రూ.5లక్షలకు కేటాయించారు?
Updated : Aug 10, 2020
గత ఏడాది ఆయన సినీ స్టూడియో నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎకరాకు రూ.5 లక్షలు చొప్పున 5 ఎకరాలు కేటాయించింది. అయితే, కోట్లు విలువచేసే భూమిని కేవలం రూ.25 లక్షలకు శంకర్కు కట్టబెట్టడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
రూ.2.50 కోట్ల విలువైన భూమిని.. ఏ ప్రాతిపదికన తక్కువ ధరకు కేటాయించారు? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడానికి తగిన ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని అడిగింది. భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని సుప్రీం పేర్కొన్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఏజీ క్వారంటైన్లో ఉన్నందున గడువు కావాలని కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.