English | Telugu
కరోనా కట్టడి కంటే దోపిడీ గురించే సీఎం ఆలోచనంతా: బుచ్చయ్య చౌదరి
Updated : May 2, 2020
కాకినాడలో మడ అడవులు, కోరుకొండలో బురద కాలువలకు సంబంధించి ముంపునకు గురయ్యే భూములను సేకరిస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో 250 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని విమర్శించారు. ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా మడ అడవులు, భూములను నరికివేశారన్నారు.
భూ సేకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని, పంపకాలు తెగక రోడ్డు ఎక్కుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రజోపయోగకరమైన భూముల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు.