English | Telugu
మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి షాక్.. అధికారంలోకి కాంగ్రెస్!!
Updated : Jun 18, 2020
దీంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ క్రమంలో అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ పక్షనేత ఇబోబీ సింగ్ గవర్నర్తో భేటీ కానున్నారని సమాచారం. విశ్వాసం కోల్పోయిన బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరనున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని గవర్నర్ను కోరే అవకాశం ఉంది. కాగా, రాజ్యసభ ఎన్నికల ముందు జరిగిన ఈ ఊహించని పరిణామం బీజేపీకి నష్టం కలిగించే అవకాశముంది.
కాగా, 2017లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను 28 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయతే 21 సీట్లు గెలిచిన బీజేపీ ఇతర పార్టీల సాయంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా పరిణామాలతో బీజేపీ సంఖ్య 19కి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.