English | Telugu
తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు
Updated : Mar 2, 2020
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. భారత్లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని పేర్కొంది. ఆదివారం నాడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐదుగురికి కోవిడ్-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్ రాగా.. మరొకరికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. అలాగే ఢిల్లీలో కూడా ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతను ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. కరోనా సోకిన వారిద్దరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.