English | Telugu
కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ మారుతున్నారని ప్రచారం! హై టెన్షన్ మధ్య దుబ్బాక పోలింగ్
Updated : Nov 3, 2020
దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి దుబ్బాక రాజకీయాలు హాట్ హాట్ గానే సాగాయి. రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోయాయి. ఓటర్లకు జోరుగా ప్రలోభాలకు గురి చేశాయి పార్టీలు. ప్రచారంలోనూ పార్టీల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పోలింగ్ కు కొన్ని గంటల ముందు కూడా తీవ్ర గొడవలు జరిగాయి. సిద్ధిపేటలోని ఓ హోటల్ లో బస చేసిన ఆందోలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తత స్పష్టించింది. హోటల్ కేంద్రంగా ఎమ్మెల్యే డబ్బులు పంపిణి చేస్తుండగా తాము అడ్డుకున్నామని, తమపైనే ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించగా.. తనను టార్గెట్ చేసుకునే వంద మంది బీజేపీ కార్యకర్తలు హోటల్ కు వచ్చారని ఎమ్మెల్సే క్రాంతి కిరణ్ చెప్పారు. ఈ ఘటనతో సిద్ధిపేటతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ హోరాహోరీగా సాగుతోంది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ధగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఓటర్లు కూడా ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు తన సొంతూరు బొప్పాపురం ఓటు వేయగా.. తొగుట మండలం తుక్కపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.