English | Telugu
జియోలో ఫేస్బుక్ పెట్టుబడి! 43 వేల కోట్ల రూపాయల డీల్!
Updated : Apr 22, 2020
కలిసి పని చేయాలనే జియో ప్లాట్ఫాంలో ఫేస్బుక్ పెట్టుబడి కోసం బైండింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
ఈ డీల్ పైన ముఖేష్ అంబానీ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాణ్యత పెంచేలా, భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజంగా నిలిపేలా జియోను తీసుకు వచ్చామని, ఇప్పుడు ఫేస్బుక్ను ఆహ్వానించామని చెప్పారు.
వ్యాపారం కోసం ఫేస్బుక్, జియో జత కట్టాయని, డిజిటల్ ఎకానమీకి తమ బంధం దోహదం చేస్తుందని మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.