English | Telugu
దూకుడు పెంచిన సీఐడి.. అమరావతి భూముల కొనుగోలుపై ఈడీ కేసు
Updated : Feb 3, 2020
అమరావతి భూముల కొనుగోళ్లు అక్రమాల కేసు పై సిఐడి దూకుడు పెంచింది. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ ప్రారంభించిన అధికారులు కొనుగోళ్లు జరిపిన వ్యక్తులను విచారిస్తున్నారు. ఇప్పటికే 4 వేల ఎకరాల మేరకు కొనుగోళ్లు, అక్రమాలు జరిగాయని క్యాబినెట్ సబ్ కమిటీ తేల్చింది. వారిలో 790 మంది తెల్లరేషన్ కార్డు దారులు ఉండటం గమనార్హం. ఇప్పటికే సీఐడీ వారికి నోటీసులను ఇచ్చింది. భూ అక్రమాల పై దర్యాప్తు చేయాలని సీఐడీ ఈడీకి లేఖ రాసింది. భూమి కొనుగోళ్ళలో మనీ లాండరింగ్ జరిగినట్లు తేల్చి అందుకు సంబంధించిన దర్యాప్తును ఈడీ చేపట్టాలనీ కోరింది. సీఐడీ నోటీసులు ఇచ్చిన వివరాల ప్రకారం కొంతమందికే తెలుసు కాబట్టి వాటి ఆధారంగా భూ డాక్యుమెంట్ ను ఈ తెల్లరేషన్ కార్డుల వివరాలను కూడా ఈడీకి లేఖ రాశారు. సీఐడీ లేఖ ఆధారంగా ఎన్పోర్స్మెంట్ అధికారులు సోమవారం నాడు కేసు నమోదు చేశారు. ఇక వారి దగ్గర నుండి తీసుకునే భూములను జగన్ ప్రభుత్వం ఏం చెయ్యనుంది? ఎవరికి ఇవ్వనుంది? అనే అంశాలు చర్చలకు దారి తీస్తున్నాయి.