English | Telugu
ధారావి మురికివాడలో కరోనా వైరస్! ఒకరు మృతి
Updated : Apr 2, 2020
ఈ ధారవి మురికివాడలో సుమారుగా 10 లక్షల మంది గుడిసెవాసులు నివసిస్తున్నారు. మరి అక్కడుంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్తో చనిపోవడంతో.. మిగతా వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 లక్షల మందిలో ఎంత మందికి కరోనా సోకిందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. జస్లోక్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఆస్పత్రిని మూసివేశారు.