English | Telugu

ఏపీలో కొత్తగా 5,145 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ మునుపటితో పోలిస్తే తగ్గింది. గత కొద్దిరోజులుగా తక్కువ సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో 70,521 శాంపిల్స్ పరీక్షించగా 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 862 మందికి, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 139 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 7,44,864కి చేరింది. గత 24 గంటల్లో 31 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,159కి చేరింది. ఇప్పటివరకు 6,91,040 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 47,665 యాక్టివ్ కేసులున్నాయి.