English | Telugu
రాష్ట్రంలో ఒక్కరోజే 149 మంది కరోనాతో మృతి!!
Updated : Jun 11, 2020
ఇక, మహారాష్ట్రలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రను కలవరపెడుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 3,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం ఒక్కరోజే 149 మంది కరోనాతో. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 357 మంది ప్రాణాలు కోల్పోతే, అందులో ఒక్క మహారాష్ట్రలోనే 149 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,041 కాగా.. కరోనా మరణాల సంఖ్య 3438 కి చేరింది.