English | Telugu

భారత్‌ లో 15 లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా వైరస్‌ తీవ్రత భారత్‌ లో రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌ లో 47,704 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 654 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,83,157కి చేరగా, మృతుల సంఖ్య 33,425కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 9,52,744 మంది కోలుకోగా.. ప్రస్తుతం 4,96,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి.